ePaper
Monday, August 31, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చెరువులో అక్రమంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్లు తొలగించాలి

చెరువులో అక్రమంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్లు తొలగించాలి

📰 Generate e-Paper Clip

 

చిట్వేలి (ప్రజాసీమ)
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలపరిధిలోని తుమ్మకొండ వడ్డిపల్లిలోని సర్వే నెంబర్ 26 లోని ఊరకుంటను సంబంధిత రెవిన్యూ,విద్యుత్ అధికారుల సహకారంతో గ్రామస్తులు ఆక్రమించుకుని వేరే సర్వే నెంబర్లలలో మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు,బోర్లను ఊరకుంటలో ఎర్పాటు చేసి ఊరకుంటను ఆక్రమించారని, అక్రమణకు గురైన ఊరకుంటను సంరక్షించాలని ఆవులకుంట గంగయ్య ఫిబ్రవరి ఒకటో తేదీ చిట్వేల్ మండల తాహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు.
సంబంధిత రెవెన్యూ ఉన్నతాదికారులు ఆక్రమణకు గురైన ఊరకుంట సంరక్షణ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థుడు ఆవులకుంట గంగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవిన్యూ అధికారుల అండదండలతోనే గ్రామస్థులు ఊరకుంటను ఆక్రమించారని ఆవుల కుంట గంగయ్య వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అక్రమణకు గురైన ఊరకుంటను సంరక్షించాలని ఆవులకుంట గంగయ్య కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!