సిద్ధవటం, ప్రజా సీమ
ఇరుగులమ్మ తల్లి అమ్మవారు తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించారు మండలంలోని మూలపల్లి క్రాస్ వద్ద వెలసిన శ్రీ ఇరుగులమ్మ తల్లి అమ్మవారు తిరుణాల మహోత్సవం సందర్భంగా ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి రమణయ్య మాట్లాడుతూ అమ్మవారికి కుంకుమార్చన అభిషేకాలు వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామని మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని బోనాలు సమర్పించారని కడప నగరానికి చెందిన ఇరగయ్య కుటుంబీకులు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారన్నారు

