కడప ఫిబ్రవరి 26 (ప్రజాసీమ రిపోర్టర్): జిల్లా ఎస్ పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగ కుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల సెంటర్ల వద్ద సీఐ స్థాయి అధికారులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది నియమించి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఎస్ఐ రాజేశ్వర రెడ్డితెలిపారు