లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు తొలి ఏకాదశి రోజున సుప్రభాత సేవ
రైల్వేకోడూరు న్యూస్
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారి పల్లి పంచాయతీలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ అధ్యక్షులు పండ్ర నరసింహులు ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ అభిషేకము అర్చనలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని చూచుటకు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పురప్రజలందరూ స్వామి వారిని దర్శించుకుని ఆయన కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆలయ అర్చకులు అక్కడికి వచ్చిన వారందరికీ ఆశీర్వాదం అందించడం జరిగినది

