రైల్వేకోడూరు బిజెపి మహిళా మోర్చా నియోజకవర్గ ఇన్ చార్జిగా కుప్పాల జ్యోతి
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ బీజేపీ మోర్చా ఇన్చార్జిగా కుప్పాల జ్యోతి నియమితుల య్యారు. ఆమె మాట్లా డుతూ ప్రజా సమస్యలను, నియోజక వర్గంలో ఉండే ప్రతి సమస్యను ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్యను పూర్తి పరిష్కారం అయ్యేంతవరకు నేను పోరాడతానని మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తెలియజేస్తే నేను సమస్య పరిష్కరిస్తారని తెలిపారు.నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన బిజెపి పార్టీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని ఆమె తెలిపారు.

