సిద్ధవటం ( ప్రజా సీమ)
సిద్ధవటం మండలం వంతాటి పల్లి గ్రామం, లంకమల అభయారణ్యం లో వెలసియున్న శ్రీ నిత్య పూజ స్వామి దేవస్థానమునకు సంబంధించిన హుండీలను 30.03.2026 వ తేదీన సోమవారము ఉదయం 11:00 గంటలకు దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో తెరిచి లెక్కించుటకు నిర్ణయించడమైనది. కావున భక్తాదులు సదరు హుండీ పరకామణి నందు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన అని ఆలయ చైర్మన్ మరియు ధర్మ కర్తల మండలి జంగిటి రాజేంద్రప్రసాద్ ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ. శ్రీధర్ తెలిపారు.

