పుల్లంపేట-(ప్రజా సీమ)
పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయతీ రాచపల్లి గ్రామం చెందిన వంకిరాజు అనసూయమ్మ కి బిజెపి నాయకులు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పూర్వ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి కృషితో .48984 రూపాయల సీఎం సహాయ నిధి మంజూరు చేయబడిందనీ, గురువారం ఆమె స్వగృహం వద్ద బీజేపీ రాజంపేట పార్లమెంట్ బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ చేతుల మీదుగా చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణ యాదవ్, నరేంద్ర రాజు, మండల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, దాసరి నాగరాజు, సూరిపల్లి వెంకటేష్,శంకర రాజు, కత్తి శ్రీనివాసులు, ఎల్లం రాజు తదితరులు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా లబ్ధి దారులు శ్రీమతి పురంధేశ్వరి కి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి ప్రతేక కృతజ్ఞతలు తెలియజేశారు.

