జనసేన పార్టీ కమిటీ సభ్యుడిగా డా. యనమల భాస్కర్ ను కలిసిన రెడ్డివారి పల్లి జనసైనికులు
రైల్వేకోడూరు ప్రజాసీమ
రైల్వేకోడూరు: జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల కమిటీ సభ్యుడిగా నియమితులైన డా. యనమల భాస్కర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డివారిపల్లె జనసైనికులు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరంపై చర్చ జరిగినట్లు తెలిపారు. డా. యనమల భాస్కర్ను కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల జనసేన పార్టీ రెడ్డివారి పల్లి నాయకులు పగడాల మనీ ప్రసాద్ , శ్రీ కారం ప్రకాష్, సవరం సాయినాథ్,జడల సతీష్ కుమార్ , దాసరి వీరేంద్ర కుమార్ మొదలగువారు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

