-చైర్మన్, జంగిటి రాజేంద్రప్రసాద్ యాదవ్
సిద్ధవటం ఫిబ్రవరి 12 నేటిపత్రిక ప్రజాసీమ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకు ఆహ్వానం అందించామని ఆలయ పాలకవర్గ చైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్ తెలిపారు మండలంలోని లంకమల అభయారణ్యం లో వెలసిన శ్రీ నిత్య పూజేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈనెల14, 15, 16, జరుగు బ్రహ్మోత్సవాలకు రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకు ఆహ్వానం అందించామని గురువారం ఆలయ పాలకవర్గ చైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్ తెలిపారు భక్తులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేశామని, భక్తులు మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలని పోలీసులకు అధికారులకు భక్తులు సహకరించి ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆలయ ఈవో శ్రీధర్ ఆలయ సిబ్బంది చంద్ర పాల్గొన్నారు

