గాలివీడు మార్చి 23 (ప్రజాసీమ విలేకరి)
మండలంలోని గోరాన్ చెరువు గ్రామం గేటు కుమ్మరపల్లి లో త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు ప్రస్తుత వున్న స్కీం బోరు మరమ్మతులు కు గురికావడం తో మోటార్ పంప్ బోరు నుంచి వెలుపలికి తీసుకురావడంలో ఇబ్బందులు వచ్చాయని సర్పంచ్ దీప్తి వెంకటాద్రి తెలిపారు.దీంతో బోరు మరమ్మతులు చేసే మెకానికల్ లను ప్రత్యేకంగా మదనపల్లి నుంచి రప్పించి తిరిగి మోటార్ ను అమర్చి త్రాగు నీరు సమస్య తలెత్తకుండా మరమ్మత్తులు చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి తీర్చడానికి నూతన మోటర్ బిగించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, సెక్రటరీ సరోజమ్మ , పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

