కడప మార్చి 13 (ప్రజాసీమ రిపోర్టర్) శుక్రవారం యోగివేమన విశ్వవి ద్యా లయ స్నా త కోత్సవ సందర్భ ముగా వల్లూరు శివయామినికి ఎమ్మెస్సీ జువాలజీ గోల్డ్ మెడల్ అందుకు న్నారు ర్యాంకును పొందడమే అసాధ్య మనే భావించే రోజుల్లో ఏ ర్యాంకు లైన తనకు తానే సాటి అని వల్లూరు శివ యామిని నిరూపించుకున్నది. వల్లూరు మల్లికార్జున రావు, లక్ష్మీ ప్రసన్న ల గారాల పట్టి వల్లూరు శివ యామిని. చిన్నత నం నుంచి చదువుల పట్ల శ్రద్ధ కనబరుస్తూ చదువులలో తనలో ఉన్న ఉన్న మేధాశక్తిని పెంపొందించుకుంటూ పాఠశాల విద్యలో కూడా తన ప్రతిభను కనపరచింది. అంతేకా కుండా ఇంటర్లో కూడా తనశైలిలో ర్యాంకుల పంట పండించుకుంది. తర్వాత నాగార్జున డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో నైన్ పాయింట్ 9.8 సిపిఐతో జిపిఏతో, పిజి సెట్ లో ఫోర్త్ ర్యాంకు యూనివర్సిటీ పరిధిలో, యోగి వేమన యూనివర్సిటీ గ్రూప్ వైజ్ డిగ్రీ లో యూనివర్సిటీ 5వ ర్యాంక్ సంపాదించి నాగార్జున డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కరస్పాం డెంట్ ల అభినందనలు అందుకున్నది, అదేవి ధంగా యూనివర్సిటీ పీజీ ఎంట్రెన్స్ లో ర్యాంకు సాధించి ఎమ్మెస్సీ జువాలజీ లో సీటు సాధించడమే కాకుండా గోల్డ్ మెడల్ సాధిం చింది, యూని వర్సిటీ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి, మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్ లతో అభినందనలు అందుకున్న శివయా మిని మాట్లాడుతూ తన విజయానికి , తల్లిదం డ్రుల ప్రోత్సాహము, నానమ్మ తాతల దీవెనలతో ఈ గుర్తింపు లభించిందని శివయా మిని తెలిపారు.
ఎమ్మెస్సీ జువాలజీ లో శివయామినికి గోల్డ్ మెడల్
0
27

