prajaseema.com
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 5:45 pm Digital Edition : PRAJA SEEMA

సిడిపిఓ రేణుక ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

రైల్వేకోడూరు  న్యూస్

ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమం లో భాగంగా రైల్వేకోడూరు మండలం లోని న్యూ కృష్ణా నగర, అంకమ్మ నగర్, ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 05-08-2026న రైల్వే కోడూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రేణుక ఆధ్వర్యంలో తల్లి పాల ప్రాముఖ్యతను గురించి, ముర్రు పాలను బిడ్డ పుట్టిన వెంటనే తాపించడం వలన కలిగే ప్రయోజనాలను , తాపించకపోవటం వలన తల్లికి బిడ్డకి కలిగే నష్టాలను విశ్లేషిస్తూ తల్లులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించటం జరిగినది.

ఈ కార్యక్రమం లో సిడిపిఓ రేణుక అలాగే సూపర్వైజర్స్ నిర్మలా, సుబ్బలక్ష్మి, యశోద మరియు అంగన్వాడీ కర్తలు రాజేశ్వరి, లక్ష్మీ నరసమ్మ మరియు స్థానిక ప్రజలు పాల్గొనటం జరిగినది.