prajaseema.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 7:39 pm Digital Edition : PRAJA SEEMA DESK

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి; యల్లటూరి శ్రీనివాస రాజు

 

రాజంపేట(ప్రజా సీమ)హెల్మెట్ ధరించండి మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు సూచించారు.బుధవారంకడప జిల్లా రాజంపేట పట్టణంలో హెల్మెట్ పై అవగాహనా సదస్సు,ర్యాలీ నిర్వహించారు.హెల్మెట్ ధరించి రాజంపేట పట్టణంలో పోలీసులతో పాటు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.పోలీసులకు సొంత నిధులతో హెల్మెట్ లను  యల్లటూరు శ్రీనివాస రాజు పంపిణీ చేశారు.

ర్యాలీని ప్రారంబించిన రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్ నాధ్ హెడ్గే.

హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసులకు, ప్రజలకు  శ్రీనివాస రాజు, ఏ ఎస్పీ మనోజ్ రామ్ నాధ్ హెగ్డే సూచించారు. ఈ కార్యక్రమంలో  పట్టణ సీఐ నాగార్జున, మన్నూరు U/G సీఐ లింగప్ప, సుండుపల్లి U/G సీఐ మస్తాన్, రాజంపేట పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.