మదనపల్లి-(ప్రజా సీమ)
మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసులపై కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా మదనపల్లె అమ్మ చెరువు మిట్ట పురపాలక ఉన్నత పాఠశాల హెచ్ఎం గా పనిచేస్తున్న శ్రీనివాసులు వైయస్ జగన్ కాలనీకి చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో రెండవ పట్టణ పోలీసులు హెచ్ఎం శ్రీనివాసుల పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.