రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేటాయించిందని రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు.సోమవారం ఏబీ చంద్రా రెడ్డి గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలానికి ప్రత్యేక నిధులు కేటాయించారని,ఒంటిమిట్ట మండలానికి టీటీడీ 100 కోట్ల అభివృద్ధి పనులు కేటాయిస్తే ,రాష్ట్ర ప్రభుత్వం కూడా 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని,ప్రజలు భాగస్వామ్యంతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ అందులో ప్రజా భాగస్వామ్యాన్ని కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన,వివిధ మండలాల టిడిపి అధ్యక్షులు,చైర్మన్లు,టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.