prajaseema.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 11:12 am Digital Edition : PRAJA SEEMA DESK

మాధవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

 

సిద్ధవటం ( ప్రజా సీమ )

సిద్ధవటం మండలం మాధవరం గ్రామపంచాయతీ మాధవరం గ్రామంలో బుధవారం ఉదయం తెల్లవారకముందే పేదలకు ఎన్టీఆర్ వితంతు వికలాంగులు పింఛన్ భరోసా కార్యక్రమంలో రాష్ట్ర స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వికలాంగులకు 6000, డయాలసిస్ పేషెంట్లకు 10000, వితంతువులకు 4000 పంచడం గర్వించదగ్గ విషయమని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు దూసుకెళుతుందని రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతో డెవలప్మెంట్ జరుగుతుందని వారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోసం అహర్నిశలు పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు , నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ కావాలని అహర్నిశలు కష్టపడుతున్నారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి నాగూర్ బషీర్ భాష , బూత్ కన్వీనర్, మాల రామకృష్ణ , షేక్ ఖాదర్ బాషా, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.