prajaseema.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 7:07 pm Digital Edition : PRAJA SEEMA DESK

మహిళా న్యాయవాదులను సన్మానించిన ఐ.ఏ.ఎల్

రాయచోటి 10 మార్చి ( ప్రజాసీమ ప్రతినిధి)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలను పురహిస్కరించుకుని మంగళవారం సాయంత్రం మహిళా న్యాయవాదులను భారత న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. భారత న్యాయవాదుల సంఘం కడప అన్నమయ్య జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఈశ్వర్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆనందకుమార్ ఆధ్వర్యంలో రాయచోటి బార్ అసోసియేషన్ కి చెందిన మహిళా న్యాయవాదులైన లక్ష్మీదేవి, కృష్ణుమ, వరలక్ష్మి, మాధవి, శివమ్మ , కైరున్ బి, మహబూబ్ జాన్, మక్బూల్ జాన్, ముకుందా ప్రియా లను ఘనంగా సన్మానించారు. న్యాయవాది థామస్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో న్యాయవాదులు రాయచోటి బార్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డి భాష, మిఠాయిగిరి ఖాదర్బాషా నాగ ముని, హూ మై యున్ భాష జగదీష్ ఇర్షాద్ నాగేంద్ర శివకుమార్ మల్లికార్జున రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు