prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 2:53 pm Digital Edition : PRAJA SEEMA

నిత్య పూజకోనకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు : ఆర్టీసీ డిఎం కన్యాకుమారి

సిద్ధవటం ఫిబ్రవరి 11 నేటిపత్రిక ప్రజాసీమ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృశ్య భక్తులకు 40 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని కడప ఆర్టీసీ డిఎం కన్యాకుమారి తెలిపారు మండలంలోని వంతాటిపల్లి గ్రామ సమీపంలోని ఆశ్రమం వద్ద బుధవారం ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య పూజేశ్వర కోనకు 40 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని శని ఆది సోమ 3 రోజులపాటు ఏర్పాటు చేశామని కడప ఆర్టీసీ బస్టాండ్ నుండి బయలుదేరి సిద్ధవటం గ్రామ శివారులోని షాది ఖానా వద్ద ఆర్టిసి కంట్రోల్ పాయింట్ వద్దకు చేరుకుంటాయని భక్తులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మహిళలకు శ్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం వెసలపాటు ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మంజుల, కంట్రోలర్ మల్లికార్జున, ఆర్టీసీ యూనియన్ ఎంప్లాయ్ బాల వెంకటేశు పాల్గొన్నారు.