prajaseema.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:00 am Digital Edition : PRAJA SEEMA

టిడిపి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న గ్రామ కమిటీ అధ్యక్షులు పాలూరు సుధా

 

పెనగలూరు (ప్రజా సీమ )
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజక వర్గం పెనగలూరు మండల టిడిపి కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముద్రపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలూరు సుధా నాయుడు మాట్లాడుతూ అన్న ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం మనమందరం ముందుకు సాగుదాం అని పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం పెట్టి ఎందరో ఆకలి తీర్చిన మహానుభావుడు అన్న న్ టి ఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో కాకలవారిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, కాకర్ల వారి పల్లి సర్పంచ్ చంద్రమౌళి, శంకర్ నాయుడు,కస్తూరి శివ మరియు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు