prajaseema.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 10:01 pm Digital Edition : PRAJA SEEMA DESK

కొమ్మివారిపల్లి అరుంధతి వాడ లో టిడిపి సంబరాలు

 

రాజంపేట (ప్రజాసీమ)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా లోక్సభలో బిల్లు ఆమోదం తెలిపినందుకుగాను, రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశానుసారం కొమ్మివారిపల్లి అరుంధతి వాడలో టిడిపి సీనియర్ నాయకులు సిద్ధారపు రామ్మోహన్  ఆధ్వర్యంలో దీపాలతో ఆనందోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన సీఎం చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషనల్ ఐటీ మినిస్టర్ లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. దేవతల సంచరించిన అమరావతిని రాజధానిగా చేయడం. మన రాష్ట్రానికి గర్వకారణమని చంద్ర బాబు, లోకేష్ గారిదే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు సిద్ధారపు రామ్మోహన్, సిద్ధార్థ సుబ్బయ్య, జి సాయి, ఎస్ మోనీశ్వర్, మదన్, విజయ్ రియాన్స్, మహిళలు రాధమ్మ సరస్వతి అరుణ హిత్విక, శ్రీదేవి, టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.