prajaseema.com
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 8:22 am Digital Edition : PRAJA SEEMA

ఎలిసెట్టి నరసింహ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

ఎలిసెట్టి నరసింహ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

రైల్వే కోడూరు ప్రజా సీమ

రైల్వే కోడూరు :కొర్లకుంట క్రాస్ వద్ద వేడుకలు మిన్నంటాయి. ప్రముఖ ఎస్వీఎస్ సంస్థ అధినేత నరసింహ 71వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులు, జనసేన నాయకులు అత్యంత కోలాహలంగా సంబరాలు నిర్వహించారు.

కార్యక్రమంలో మోగించిన డ్రమ్స్ వాయిద్యాలు, పేల్చిన పాన సంచాల శబ్దాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ రక్తదానం, నేత్రదానం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యుల నిరంతర ప్రజాసేవ తన జీవితానికి ఎంతో ఆదర్శమని ఈ సందర్భంగా నరసింహ పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో పార్ల కిరణ్, హనుమంతు సునీల్, ధరణి నాగయ్య, ఆముదాల ప్రసాద్, వంశీ, హరీష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.