prajaseema.com
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:15 pm Digital Edition : PRAJA SEEMA

ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్న వి బి గ్రామ్ జీ పథకాన్ని వ్యతిరేకించాలి

ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్న వి బి గ్రామ్ జీ పథకాన్ని వ్యతిరేకించాలి

రైల్వేకోడూరు  న్యూస్

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో వి. బి గ్రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని మంగళవారం సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు పర్యటించారు.. ఉపాధి కూలీలకు . కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పై చేస్తున్న అన్యాయం పైన అవగాహన కల్పించారు అనంతరం ‌ సిపిఐ( ఎంఎల్ )లిబరేషన్ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి సిగి చెన్నయ్య మాట్లాడుతూ. అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న

కాంపెయిన్ లో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ క్యాంపియన్ జరుగుతుంది. అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాల్ని 200 రోజులకు, రోజు వేతనాన్ని రూ 600 లకు పెంచాలనీ, అవకతవకల్ని సరిచేసి పటిష్టంగా అమలు చేయాలని గ్రామీణ కార్మికులు ఒకపక్క కోరుతుంటే ఉన్న పధకాన్నే నీరుగార్చేందుకు మోడి ప్రభుత్వం విబి గ్రామ్ జీ పధకాన్ని తీసుకొస్తుందనీ, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు 2005 లో పేదల ఆకలి తీర్చటానికి తీసుకొచ్చిన పధకం ద్వారా లక్షలాది పేద ప్రజలకు ఉపాధి హక్కుగా దొరుకుతుంది అనీ, అయితే కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేస్తూ మోసపూరితంగా హామీని తొలగిస్తోందని ఆయన తెలిపారు ఉపాదా హామీ చట్టాన్ని 200 రోజులు పని దినాలు కల్పించాలని అలాగే ప్రతి కూలీకి 700 రూపాయలు ఇవ్వాలని కోరారు ఉపాధి కూలీలకు షా మీద టెంట్లు వేసి మజ్జిగ వాటర్ ప్యాకెట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించి తీర్చాలని ఆయన అన్నారు పేదల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు రాష్ట్ర ప్రభుత్వం నిసుగ్గుగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తలాడిస్తూ ఉండటం ఈ కూటమి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ పార్టీ నాయకులు సుబ్బయ్య ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.