- ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైల్వేకోడూరు ప్రజాసీమ
రైల్వేకోడూరు, (సాయంకాలం ప్రతినిధి) ఆగస్టు, 24:… రైల్వే కోడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు తాడిపత్రి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బెంగళూరులోని ఓ మెస్సులో పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసినట్లు సమాచారం బద్వేల్కు వెళ్లేందుకు కోడూరులో దిగిన అనంతరం మద్యం మత్తులో రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలు, మృతుడి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
–