ఆరుద్ర నక్షత్రం రోజున శివనామ స్మరణతో మారి మోగిపోయిన భుజంగేశ్వర స్వామి ఆలయం
రైల్వేకోడూరు పట్టణ నడిబడ్డన వెలసినటువంటి శ్రీ భువనేశ్వరీ సమేత భుజంకేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారము ఆరుద్ర నక్షత్ర సందర్భంగా వేకువజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తుల పాల్గొనిస్వామి వారి దర్శనానికి వచ్చిన సుమారు 300 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది, భక్తులకు తీర్థప్రసాదాలు , వచ్చిన భక్తులకు అన్ని వసతులు కల్పిస్తూ ఆలయ కమిటీ చైర్మన్ ఉంగరాల సురేంద్ర కుమార్, ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ ,యోగేశ్వర శర్మ అదే విధంగా స్థానిక భక్తులు తోట శ్రీనివాసులు, పత్తిపాటి హరిప్రసాద్, కోవూరు గంగాధర్ , కొప్పరపు అరవింద్ వీరందరూ కూడా స్వామివారి యొక్క భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.