అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి నాయకులు
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు పట్టణంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం చంగల్ రాజు , మరియు అన్నమయ్య జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి తోట శ్రీనివాసులు, యువ మోర్చా జిల్లా సెక్రటరీ సాయి ఆచారి, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ శ్రీమతి కుప్పాల జ్యోతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగినేని బాల సుబ్రహ్మణ్యం, మండల జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు పి వి రమణా, మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.